వెంకటాపూర్, మార్చి 17: రామప్ప శిల్పకల అత్యద్భుతమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు సందర్శించారు. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడి, ములుగులోని గట్టమ్మ ఆలయాన్ని సందర్శించారు.
అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో వారిని శాలువాలతో సన్మానించి, ఆశీర్వచనం అందజేశారు. వీరి వెంట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, నామవరపు రాజేశ్వర్రావు, జస్టిస్ వినోద్ కుమార్, రిజిస్ట్రార్లు నందికొండ నర్సింగరావు, ప్రవీణ్కుమార్, శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.