తిరువనంతపురం : కేరళలోని పళనికి చెందిన మహిళపై తమిళనాడులో దారుణం చోటుచేసుకుంంది. 40 ఏండ్ల మహిళపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం కలకలం రేపింది. తమిళనాడులోని పళనికి భర్తతో కలిసి వచ్చిన మహిళపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన సమయంలో దిండిగల్ జిల్లా పళనిలో ఓ లాడ్జిలో దంపతులు ఉన్నారు. భర్త ఆహారం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లగా లాడ్జి మేనేజర్ సహా కొందరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డారు.
ఆపై ఆమె ప్రైవేట్ భాగాలను బీరు బాటిళ్లతో గాయపరిచారు. భర్త తిరిగి లాడ్జికి చేరుకోగానే నిందితులు ఆయనపై దాడి చేశారు. జూన్ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను పోలీసులను ఆశ్రయించినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ ఆరోపించారు. బాధితురాలు ప్రస్తుతం పరియారంలోని ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు.