ఏడేండ్ల కిందట తెలంగాణ మోడువారిన చెట్టు.. దీనికి బతుకే లేదని అనుకొన్నం. కానీ.. తెలంగాణ తల్లి మెడలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలంకరించిన హరితహారంతో పచ్చదనం పురుడు పోసుకొన్నది. ఎండిన చెట్టు పచ్చగా మారింది. ఇప్పుడు మహావృక్షంగా ఎదుగుతున్నది. రాష్ట్రంలో ఆకుపచ్చని అద్భుతాలు జరుగుతున్నవి. తెలంగాణలో పచ్చని అడవి పందిళ్లతో పండుగ కళ సంతరించుకొంటున్నది. అటవీ విస్తీర్ణం పెరుగుదలతో కొత్త జీవం పచ్చగా కళకళలాడుతున్నది.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 63,200 హెక్టార్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21.47 శాతం అడవులు ఉన్నాయి. మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో హైదరాబాద్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దశాబ్దకాలంలో నగరంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో గత రెండేండ్లలో అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్లు పెరుగగా, తెలంగాణలోనే 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదుకావటం విశేషం. దేశంలో విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్లో, శాతం పరంగా మిజోరంలో అడవులు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా- 2021 రిపోర్టులో తెలిపింది.
తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటడం సత్పలితాలిస్తున్నది. రాష్ట్రంలో 63,200 హెక్టార్ల విస్తీర్ణంలో కొత్త పచ్చదనం పెరిగింది. పచ్చదనం పెరిగిన దేశంలోని ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. హైదరాబాద్ నగరం 4,866 హెక్టార్ల కొత్త పచ్చదనం వృద్ధితో దేశంలోని మెగాసిటీలో నంబర్ 1గా నిలిచింది.
–మోహన్చంద్ర పరిగేయిన్ (ఐఎఫ్ఎస్), కేంద్ర పర్యావరణ, అటవీశాఖ.
పల్లె ప్రకృతి వనాలున్న ఆవాసాలు 19,472
పల్లె ప్రకృతి వనాలు విస్తరించిన ప్రాంతం13,657ఎకరాలు
బృహత్ ప్రకృతి వనాలు మండలానికి ఒకటి.
మండలాలు 526
ఎకరాల్లో ప్లాంటేషన్7,178
రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు 15,241
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో 12,759
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో1002
అటవీశాఖ ఆధ్వర్యంలో 842
ఇతర నర్సరీలు 638
ప్లాంటేషన్: 20రూట్
స్టాక్ రెజువనేషన్ 80
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ 10
ఇతర ప్రాంతాల్లో 130
రాష్ట్రవ్యాప్తంగా 230
హరితహారం వ్యయం రూ.6,556 కోట్లు
దేశవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో మహానగరాల్లో
పచ్చదనం పెరుగుదలలో హైదరాబాద్ ప్రథమస్థానంలో నిలిచింది.
నగరంలో 4,866 హెక్టార్లలో అదనంగా అటవీ విస్తీర్ణం పెరిగింది.
మరోవైపు ఢిల్లీలో 1,991 చదరపు కిలోమీటర్లు,
అహ్మదాబాద్లో (855 చ.కి.మీ), బెంగళూరులో (498 చ.కి.మీ)
అటవీ విస్తీర్ణం తగ్గింది.