కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు.. ఆతిథ్య దేశంతో ఆడుతున్న సెకండ్ టెస్ట్లో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు మనాల్ చౌహాన్ (150), కుశాగ్ర ఓజా (111) శతకాలకు తోడు కెప్టెన్ యశ్వర్ధన్ (78) రాణించడంతో పర్యాటక జట్టు 411 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన శ్రీలంక అండర్-19 టీమ్.. భారత బౌలర్లు కట్టడిచేయడంతో రెండో రోజు ఆట చివరికి 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేసి కష్టాల్లో పడింది.