ఢిల్లీ: వచ్చే నెలలో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న హాకీ ప్రపంచకప్ కోసం హాకీ ఇండియా 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని ఈ జట్టులో అనుభవజ్ఞులు, యువకులతో టీమ్ను సమతూకంగా ఎంపికచేసినట్టు చీఫ్ కోచ్ ఫల్టన్ తెలిపాడు. వరల్డ్కప్లో భారత్.. ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్తో పూల్-డీలో ఉంది. ఆగస్టు 15న వేల్స్తో ఆడబోయే మ్యాచ్తో టైటిల్ వేటను ఆరంభించనుంది. 17న ఇంగ్లండ్, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.
భారత జట్టు: హర్మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్), మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కెరా, జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్, హార్ధిక్ సింగ్, మన్ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్, దిల్ప్రీత్ సింగ్, షిలానంద్ లక్రా, సుఖ్జీత్ సింగ్, మన్దీప్ సింగ్, అభిషేక్.