హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ వేదికగా జరుగుతున్న ఆరో ‘వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా 2026’ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. తొలిరోజు నగరంలో కురిసిన వర్షానికి తోడు అనుకూలమైన గాలులతో సెయిలర్లు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగారు. 10 నుంచి 17 నాట్స్ వేగంతో విసిరిన గాలుల నడుమ రెండు సెషన్లలో కలిపి ఆరు రేసులను విజయవంతంగా పూర్తిచేశారు. ఆప్టిమిస్ట్ బాయ్స్ విభాగంలో టీఎస్ఏకి చెందిన బి. రవికుమార్, గర్ల్స్ విభాగంలో ఆతిథ్య సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్కు చెందిన శృంగారి రాయ్ ప్రతిభ చాటి తమ విభాగాల్లో ఆధిక్యంలో నిలిచారు.