యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్(BRS) పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి(Bhuvanagiri) సమావేశం శుక్రవారం భువనగిరిలో జరగనున్నది. మాజీ మంత్రులు హరీశ్ రావు(Harish rao), జగదీశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు భువనగిరిలో పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై వారు దిశా నిర్దేశం చేయనున్నారు.