Harish Rao | సిద్దిపేట : రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. స్వామి దయతో రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశం, రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారి ప్రబలకుండా చూడాలని ప్రార్థించారు. ప్రజలందరూ ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హరీష్ రావుకు ఆశీర్వాదం ఇచ్చారు.
స్థానిక గణేష్ నగర్ శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు ద్వారాన్ని హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు హరీష్ రావును సన్మానించారు. ఆలయ అభివృద్ధి పనులు, షెడ్ నిర్మాణ పనులఫై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగులు పనులు పూర్తి చేసి కొద్దీ రోజుల్లోనే ప్రారంభం చేసుకుందామని హరీశ్రావు చెప్పారు.