హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ వేసేలా కేంద్రం 9న ఉత్తుర్వులు జారీ చేసింది. అయితే అవి కేవలం ప్రైవేటు కేంద్రాలకే పరిమితం అయ్యాయని పేర్కొన్నారు.
కరోనా కొత్త వేరియంట్లు వస్తున్నందున రెండు డోసులు పూర్తి చేసుకొన్న అర్హులందరికీ ప్రభుత్వ కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది ప్రికాషనరీ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.