హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటర్ల సౌకర్యం, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసింది.
మొత్తం 36,353 పోలింగ్ కేంద్రాలు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఓటర్ల సంఖ్య, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 460 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.