హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తమిళనాడులో జరిగే వేలాంకణి వార్షిక ఉత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఏటా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారు.
దీంతో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.