Harish Rao | ఖమ్మం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఖమ్మానికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం నగరంతోపాటు చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహా ఇతర నేతలు ఇప్పటికే సన్నాహక పనులను పూర్తిచేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొంటారు.
ఆ తరువాత పత్తి, మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శిస్తారు. అనంతరం చింతకాని మండలంలో రైతులను పరామర్శిస్తారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పిలుపునిచ్చారు.