Harish Rao | కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గులాబీ పార్టీని గుండెలకు హతక్కు చరిత్ర కామారెడ్డిదన్నారు. ఉద్యమకారులున్న చైతన్యవంతమైన గడ్డ కామారెడ్డి అన్న ఆయన.. పార్టీ పెట్టిన రెండునెలలకే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జడ్పీలు గెలిచామన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో అని మండలాలు గెలిచిమన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటుదామని పిలుపునిచ్చారు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ ఉద్యమకారుడు, ప్రజల్లోనే ఉంటారన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో పని చేసి అనిల్కుమార్ను గెలిపించుకుందామన్నారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలకు నిజమేంటో నిలకడమీద తెలుస్తుందని.. కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని రేవంత్రెడ్డి అన్నారని.. కాంగ్రెస్కు ఓటు వేస్తే అన్ని గ్యారంటీలకు ఎగనామం పెడతారన్నారు. రుణమాఫీ ఎగ్గొట్టినా, రైతుబంధు ఇవ్వకున్నా తమకే ఓటేశారని రేవంత్ అంటడన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతరన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.
రైతాంగాన్ని అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే రైతులకు భరోసా అన్నారు. 280 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమైందని.. 38 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. 100 మందిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు చెప్పింది గానీ ఉద్దరించిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు. దేవుళ్లను రాజకీయ కోసం వాడుకుంటున్న పార్టీ బీజేపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన దొంగలను మళ్లీ పార్టీలోకి తీసుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.. ఎవరూ అధైర్యపడొదన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి కార్యకర్తలకు ఇది పరీక్ష అని.. నా ఎన్నిక కోసం మీరు ఎంత కష్టపడ్డారో గాలి అనిల్ కుమార్ గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలని కోరుతున్నానన్నారు. నాకొచ్చినంత మెజారిటీతో ఆయనను గెలిపించాలని.. కామారెడ్డి అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు ఇక్కడికొచ్చి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. రూ.2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కు ఓటు వేయాలని.. కానివాళ్లు బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. కేసీఆర్ మాట తప్పని మనిషి అని.. కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలని.. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలన్నారు. ప్రతి నెల రూ.2,500, డిసెంబర్ నెల నుంచి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా సమయంలో రైతుబంధు ఆపకుండా కేసీఆర్ ప్రభుత్వం వేసింది. కాంగ్రెస్ వాళ్లు ఎకరాకు ఇస్తా అన్న రూ.15వేలు కాదు కదా.. రూ.10వేలు కూడా కోతలకు దగ్గర వచ్చిన వారి సరిగా ఇయ్యలే. ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. అప్పుడే వాళ్లకు తాము మోసం చేశామని తెలుస్తుందన్నారు. తెలంగాణా కు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలు దగ్గర వచ్చినయ్ కాబట్టే ఇవాళ పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గించారని.. కేసీఆర్ కన్నా యజ్ఞ యాగాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరన్నారు. బీజీపీ దేశంలో రైతుల కోసం, గిరిజనుల కోసం చేసిందేం లేదని.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. అవకాశవాదులను, ప్రలోభాలకు గురై పార్టీలు మారిన వారిని ఇక పార్టీలోకి తీసుకోబోమన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున ప్రశ్నించే గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.