Harish Rao | రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి అని ఒక వీడియోను సోషల్మీడియా వేదికగా పోస్టు చేశారు.
రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, నిన్న ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండని హరీశ్రావు మండిపడ్డారు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పకునేది లేక గప్పాలు కొట్టిండని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ అంటూ, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి , ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
వ్యవసాయ ప్రణాళికను గాలికి వదలి రైతులు, మహిళలు, వృద్దులు అందర్నీ యూరియా కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెడే పరిస్థితి తెచ్చావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు మండిపడ్డారు. మీ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. మీ రైతు వ్యతిరేక విధానాతో రైతులు నరకం చూస్తున్నారని అన్నారు. గత సీజన్ యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి మీరు, మీ ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది? అని ప్రశ్నించారు. యూరియా కొరత రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని, ఖానాపూర్ మండలం, ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి.
రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, నిన్న ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా… pic.twitter.com/Wty6NEh500
— Harish Rao Thanneeru (@BRSHarish) December 6, 2025