హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకులానికి చెందిన 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఫైరయ్యారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని విమర్శించారు. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నదని చెప్పారు. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
స్థానికంగా ఉన్న హాస్పిటళ్లలో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రభుత్వాన్ని నిలదీశారు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారని ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉందని, రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నది.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం.… pic.twitter.com/5nzJ9R5GVl
— Harish Rao Thanneeru (@BRSHarish) November 3, 2024