ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్కు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావులను అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు https://t.co/piZLqqXGDS pic.twitter.com/M5XQUZ6z5O
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది
పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు
ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారు
రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది.. కష్టాల్లో ఉన్న రైతులను… https://t.co/hdCUm43JaD pic.twitter.com/VyKPExhTCE
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026