కరీంనగర్ రాంనగర్, ఆగస్టు 10 : కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్.. బీఆర్ఎస్ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్పై ఆదివారం రాత్రి దాడికి పాల్పడటం కలకలం రేపింది. గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గం గుల కమలాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గంగుల మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్గా అవకాశం ఇస్తే దాడుల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్లో ఎందుకు ఉంటున్నావ్’ అని శ్రీకాంత్ను బీజేపీ కా ర్పొరేటర్ సోమిడి వేణు బెదిరిస్తూ ఓ గుం డాలా 11 మందితో కలిసి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్కి తెలుస్తున్నదా? అని ప్ర శ్నించారు. ఈ ఘటనతో బండి సంజయ్కి సంబంధం లేకపోతే కార్పొరేటర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.