Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు ఏర్పాటుచేసిన విద్యా కమిషన్లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా? సూల్, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ‘ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్. పైగా ఆయనొక ఇంజినీర్. ఆఫీసులు నడపడం వేరు, చదువులు చెప్పడం వేరు, పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన.. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా?’ అని ప్రశ్నించారు.
వ్యవస్థను ఈ కమిటీ మార్చుతుందా?
తెలంగాణ విద్యా భవిష్యత్ను మార్చేం త అర్హతగాని, నైపుణ్యంగాని ఈ కమిటీకి ఉన్నట్టు తమరు నమ్ముతున్నారా? అని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి హరీశ్రావు ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా కమిషన్లో.. విద్యావేత్తలు, అనుభవజ్ఞులైన టీచర్లు, చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్ట్ నిపుణులు లేకుండానే రాష్ట్రానికి ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయవచ్చనే గొప్ప ఆలోచన చేసిన ఘనత, సీఎం రేవంత్రెడ్డికే దకుతుందని ఎద్దేవా చేశారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని దుయ్యబట్టారు. గత రెండేండ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి, సబ్జెక్ట్ తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించకుండా, సంబంధం లేని వారితో కమిటీ వేసి, కాలయాపన చేసి ఏం సాధించారని ప్రశ్నించారు.