Harish Rao | కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారని.. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప.. ఇరిగేషన్పై దృష్టి లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను పదవుల కోసం తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్ మౌనం’ అన్న అంశంపై హరీశ్రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే.. సీఎం, మంత్రులు మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు.
గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని.. కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడరని నిలదీశారు. గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరని.. నిధులు, నదులు రెండు ఆంధ్రాకేనని.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా మాట్లాడడం లేదన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రెండు టీఎంసీ బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారని.. మరి నేడు 200 టీఎంసీ బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదని.. మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్? అని నిలదీశారు.
తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడని.. కేంద్రంలో పరపతితో చంద్రబాబుపై నుంచి కాకుండా పోలవరం నుంచి నీళ్లు మళ్లించి.. కేంద్రం నుంచి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నదని ఆరోపించారు. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని.. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తామన్నారు. మీరు ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ ఆపాలని, చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడాలని.. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవాలని సూచించారు.
ఏపీ జలదోపిడీ వయా బనకచర్ల.
“బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి – కాంగ్రెస్ మౌనం” అంశంపై తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ద్వారా వివరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు.
(1/7) pic.twitter.com/6vmjnHr5X1
— Office of Harish Rao (@HarishRaoOffice) June 14, 2025