హైదరాబాద్ : ఎనిమిదో ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ప్రారంభించారు. ఆయుష్ కార్యాలయంలో ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ కార్యక్రమం కొనసాగనున్నది. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ యోగ అంటే మనసు, శరీరం, ఆత్మల కలయిక అనీ, ఈ మూడింటిని అది ఏకం చేస్తుందన్నారు. ప్రపంచంలో 75శాతం రోగాలున్నా.. తన చుట్టూ అందరూ రోగులే ఉన్నా.. తనకు రోగం వస్తే కానీ ఆలోచించకపోవడం, జాగ్రత్తపడక పోవడం అందరికీ అలవాటైందన్నారు.
యోగా ఆసనాలు ప్రాణాయామం, క్రియలు, ముద్రలు, బంధములు లాంటి కొద్దిపాటి శ్రమతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించవచ్చన్నారు. యోగతో మృతకణాలు జీవ కణాలుగా మారి ఆయష్షు పెరుగుతుందన్నారు. ఇప్పుడున్న ఆధునిక సమాజ స్థితిలో ప్రతి ఒక్కరి ఒత్తిడిని యోగా తగ్గిస్తుందన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, ఆయుర్వేదం నేచురోపతి కోర్సులు కూడా ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదివి సమాజానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.