సిద్దిపేట : పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ బాస్ కేసీఆర్ సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10న సిద్దిపేటలో(Siddipet) బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో(KCR road show) నిర్వహించనున్నారు.
దీనిని విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం ఏర్పాట్లలో తలమునకలైంది. కేసీఆర్ సభ ఏర్పాట్లను మంగళవారం మాజీ, మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) పరిశీలించారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. అధినేత బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది.