హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తన లక్ష్యానికి చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ద్వారా రూ.75,189 కోట్ల రాబడి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, జీఎస్టీ బకాయిలను కేంద్రం సరిగా విడుదల చేయకపోవడం తదితర కారణాలతో ఆ అంచనాను రూ.72,500 కోట్లకు కుదించింది. ఇందులో శుక్రవారం నాటికి రూ.7,007 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మొత్తం అంచనాల్లో 97 శాతానికి సమానం. ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన 6 రోజుల్లో మరో రూ.2,500 కోట్ల రాబడి వస్తుందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తున్నది.
తెలంగాణను ఆర్థికంగా అడ్డుకునేందుకు కేంద్రం అన్నివిధాలా ప్రయత్నిస్తున్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అండగా నిలవకపోగా అడుగడుగునా అకసు వెళ్లగకుతున్నది. తెలంగాణకు రావాల్సిన పన్నులను సెస్సులు, సర్చార్జీల రూపంలో తన్నుకుపోతున్న మోదీ సర్కారు.. చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది. కుంటిసాకులు చెప్తూ ఏటా ఎంతో కొంత పరిహారాన్ని పెండింగ్లో పెడుతున్నది. ఇలా గత మూడేండ్లలో రూ.2,433 కోట్లు పెండింగ్లో పెట్టింది. ఈ బకాయిలు వస్తే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సులభంగా తన అంచనాలను అధిగమిస్తుంది. కానీ, ఆ బకాయిలను చెల్లించాలని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, అధికారులు ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్పి చేసినా కేంద్రం స్పందించడం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 6 రోజులు మిగిలి ఉండగానే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రూ.70 వేల కోట్ల మైలురాయిని అధిగమించడంపై ఆర్థిక మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంస్కరణల అమలు తోనే ఇది సాధ్య మైందంటూ.. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్, సిబ్బంది కృషిని అభినందించారు. కొత్త సంస్కరణల్లో కీలకంగా వ్యవ హరిం చిన ఐఐటీ హైదరాబాద్ టీమ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శోభన్బాబు సేవలను ప్రశంసిం చారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తన పూర్తి లక్ష్యాన్ని చేరుకుం టుందని ఆశిస్తున్నట్టు మంత్రి హరీశ్రావు ట్విట్టర్లో పేర్కొన్నారు.