హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్గాంధీ అశోక్నగర్ను సందర్శించాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘శోక’నగర్గా మార్చిన తీరు చూడాలని, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన వినాలని మంగళవారం ఎక్స్ వేదికగా కోరారు. ‘రాహుల్గాంధీజీ.. మీరు ఎన్నికల ముందు అశోక్నగర్లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థులపై కరశంగా వ్యవహరించింది. లాఠీచార్జి చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? మీరు వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 శాతం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ప్రక్షాళన సంగతి దేవుడెరుగు, టీఎస్పీఎస్సీని టీజీపీఎస్గా పేరు మార్చి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ, అది కేవలం జాబ్ లెస్ క్యాలెండర్గా మిగిలిపోయింది. ఈ పది నెలల కాలంలో నిరుద్యోగభృతి, రూ.5 లక్షల యువ వికాసం పథకం వంటి హామీల ఊసు కూడా లేదు. నిరుద్యోగులు, విద్యార్థులపై మీరు, మీ పార్టీ చూపిన కపటప్రేమ బట్టబయలైంది. కాంగ్రెస్ ప్రభుత్వ కరశ పాలనను నిరుద్యోగ యువత తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది’ అని హరీశ్రావు పేర్కొన్నారు.