KCR | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన దశాబ్ది వేడుకలను ముగించుకునే సందర్భంలో అమరులకు ముందుగా నివాళి అర్పిద్దామని పేర్కొన్నారు. ప్రజాస్వామిక వాతావరణంలో పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనకోసం భావజాలవ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకలజనులకు బోధించి, పోరాటంలో సబ్బండ వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను, ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి, తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పిం చి, తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నా రు. అనేక త్యాగాలకోర్చి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో పటిష్ట పరుచుకుంటూ సమర్థవంతంగా పాలనను అం దించిన పదేండ్ల స్వయంపాలనాకాలం దేశానికి అభివృద్ధి, సంక్షే మ రంగాల్లో తెలంగాణను ఒక రోల్ మోడల్గా నిలిపిందని పే ర్కొన్నారు. అమరుల త్యాగాల ను వృథా పోనీయకుండా ప్రజ ల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు.
రాగద్వేషాలకు తావివ్వకుండా
బాధ్యతతో, చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేష భావనలకు తావివ్వకుండా తెలంగాణ సమా జ ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన నిజమైన ప్రజాసంక్షేమ పాలన స్ఫూర్తినందుకొని ముందుకుసాగడం ద్వారానే ప్రస్తుత ప్రభుత్వం అమరుల ఆకాంక్షలను నెరవేర్చగలదని కేసీఆర్ పేర్కొన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుం టూ వారికి ఘన నివాళి అర్పించేందుకు శనివారం కొనసాగిన అమరజ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులకు, తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. జూన్ 2, జూన్ 3 తేదీల్లో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల ము గింపు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.