హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా హెచ్చరించారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని, దీనిపై పునరాలోచన చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నామా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హకులకు నష్టం కలిగించే ఏ అంశాన్నీ అంగీకరించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హకులకు విఘాతం కలిగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం, కష్టం కలిగే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ హకులు కాపాడేందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు.
బడ్జెట్లో సాగుకు మొండిచేయి
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి, రైతులకు మొండిచేయి చూపించారని నామా విమర్శించారు. బడ్జెట్లో కనీస మద్దతు ధర అమలు ప్రస్తావనే లేకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందారని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సాయాన్ని పెంచకపోవడంతో రైతులపై కేంద్రానికి ఉన్న ప్రేమ ఏమిటో స్పష్టమైందని ఎద్దేవా చేశారు. 2022-23 నాటికి దేశంలో రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పుకున్న కేంద్రం ఈ బడ్జెట్లో ఒకమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కానీ తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందని వివరించారు.
జిల్లాల్లో నవోదయ విద్యాలయం ఎకడ?
విభజన హామీల అమలులో కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్షనే ప్రదర్శిస్తున్నదని నామా ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా, తొమ్మిది జిల్లాలకు మాత్రమే నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేశారని దుయ్యబట్టారు. జిల్లాకు ఒక నవోదయను ఎందుకు మంజూరు చేయాలేదో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు కర్మాగారం, జిల్లాల్లో నవోదయ విద్యాలయం వంటి విభజన హామీల కోసం పెద్ద ఎత్తున పోరాడామని గుర్తచేశారు. దేశంలోనే అత్యధిక స్థాయిలో తెలంగాణలో ఆయిల్పాం పంట సాగవుతున్నదని, కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని వివరించారు.