హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి సం ఘం, వివిధ రాష్ర్టాల పద్మశాలి సంఘా లు, తెలంగాణలోని పద్మశాలి నాయకులంతా ఏకమై మునుగోడులో భారీ స మావేశం నిర్వహిస్తామని చెప్పారు.
జీరో జీఎస్టీ ఉద్యమానికి ఇప్పటికే 13 రాష్ర్టాల నుంచి 15 రాజకీయ పార్టీలు, 66 మం ది ఎంపీలు మద్దతు తెలిపారని శనివా రం ఒక ప్రకటనలో వివరించారు. జీఎస్టీ ఉద్యమానికి టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మరింత ఒత్తి డి పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.