కొండమల్లేపల్లి, అక్టోబర్ 29: తెలంగాణ లో అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డగో లు హామీలు, ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే.. రా ష్ర్టాన్ని ఆగం చేస్తారని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి చై ర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి హెచ్చరించారు. అ ్న వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని గుత్తా ఉద్ఘాటించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుత్తా మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు కరెంట్ కోతలతో నానా గోసలు పడ్డారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లతో విద్యుత్తు వ్యవస్థను గాడిలో పెట్టారని గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, పరిశ్రమలు, గృహ అవసరాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్.. అన్నదాతలకు రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, సకాలంలో ఎరువులు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపడుతూ రైతు బాంధవుడిగా నిలిచారని సుఖేందర్రెడ్డి కొనియాడారు. రాష్ట్రం బాగుకోసం సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధికారం కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని గుత్తా ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.