నల్లగొండ: సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా పక్షపాతి అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. ఆసరా పెన్షన్లు (Aasara Pension) అందుకుంటున్నవారిలో, బీడీ కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. కేజీవీపీ (KGVP) స్కూళ్లు, కాలేజీలు ఎక్కువ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మహిళా దినోత్సవం (Women’s day) సందర్భంగా నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళలకు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై వారంలో మంగళవారం రోజున మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిచనున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ సహాయం అందించామని చెప్పారు. రాష్ట్రంలో స్ధానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించామని వెల్లడించారు. అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాల కట్టడికి షీ టీమ్ (She teems), భరోసా సెంటర్లను ఎర్పాటు చేశామన్నారు. తెలంగాణలో మహిళల భద్రత మీద అంతర్జాతీయ సంస్థలు దృష్టిసారించాయన్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై ప్రభుత్వంపై ఆరోపణలు సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ స్థితికి జారిపోయిన ప్రతిపక్షాల రాజకీయాలను చేస్తే బాదేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కానరావడం లేదని, కేవలం భూతులు తిట్టడం మేదే ఫోకస్ పెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మీద అసభ్య పదజాలం సరికాదని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి శనిలా దాపురించారని అసహనం వ్యక్తంచేశారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రతిఒక్కరికి అవకాశం వస్తుందన్నారు. కాంగ్రెస్లో పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం మీదే నాయకులు దృష్టిసారించారని ఎద్దేవాచేశారు.