మిర్యాలగూడ/ మిర్యాలగూడ టౌన్/ దేవరకొండ, ఏప్రిల్ 25: దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు, దేవరకొండలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడేందుకు సీఎం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేశారు. ముస్లింలు భారతదేశ పౌరులు కాదా? వారి అభివృద్ధికి కేంద్రం బాధ్యత తీసుకోదా? అని ప్రశ్నించారు. ఆయా సమావేశాల్లో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, రమావత్ రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.