పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల పై విధించిన ఐదుశాతం జీఎస్టీని రద్దు చేయాలని ధర్మారం మండలం ఖిలా వనపర్తి గ్రామ చేనేత పవర్ లూమ్ కార్మికులు, పద్మశాలీలు డిమాండ్ చేశారు . టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు, తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రికొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీకి పోస్టుకార్డులను రాశారు.
ఇప్పటికే కేంద్ర విధానాలతో చేనేత కార్మికులు ఆర్థికంగా కుంగిపోయిన దశలో జీఎస్టీ మరింత పెనుభారం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండలంలోని ఖిలా వనపర్తి పద్మశాలీ సంఘం గ్రామ అధ్యక్షుడు చెన్నూరి సత్యనారాయణ, మండల కన్వీనర్ కూరపాటి శ్రీనివాస్, నందల మల్లేషం, గ్రామ సర్పంచ్ సాగంటి తార కొండయ్య, సభ్యులు సిరిపురం కిషన్ కొండ బత్తుల నరేష్ గౌడ్, భాస్కర్, కొండబత్తుల అజయ్, ఒడ్నల సంతోశ్ తదితరులు పాల్గొన్నారు .