ఆదిలాబాద్ : హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో భారీ ఎత్తున మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఒకే రోజు 10 లక్షల మొక్కలు నాటడం అభినందనీయమన్నారు.
మొక్కలను కాపాడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పచ్చదనాన్ని సంతరించుకుంటుందన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో నాలుగు శాతం గ్రీనరీ పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో గ్రీన్ కవరేజ్ పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు కేంద్ర నివేదికలు సూచించినట్లు ఎంపీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్