Group-1 Mains | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 21 నుంచి యథావిధిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రాథమిక కీలో తప్పులున్నాయనే పిటిషన్పై డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లన్నింటినీ హైకోర్టు కొట్టి వేసింది.
ఇక అశోక్ నగర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పోలీసుల దాడుల్లో పలువురు అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. జీవో 29 రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని అభ్యర్థులు తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోతోంది.
ఇవి కూడా చదవండి..
Telangana | 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఓయూ వైస్ ఛాన్సలర్గా కుమార్