రంగారెడ్డి : ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు. అటవిశాఖ రేంజ్ అధికారి జే విష్ణువర్ధన్తో కలిసి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని చెప్పారు. మొక్కలు నాటి, సంరక్షించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూరుస్తున్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
హరితహారంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు తెలెత్తుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత నాలుగు దఫాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రత్యేక చొరురవతో మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగుతున్నదని ప్రశంసించారు. రైతులు తమకున్న పొలంలో కనీసం పదిశాతం చెట్ల పెంపకానికి కేటాయించేలా వారిని చైతన్యపరచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజ్రాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి