హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్కు చోటుదక్కింది. సామాజిక సేవా విభాగంలో గంటలో అత్యధిక మొకలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంతోష్కుమార్కు రికార్డ్స్లో చోటు కల్పించినట్టు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాలకౌల్ బెనర్జీ తెలిపారు. లిమ్కా బుక్ ప్రశంసపత్రాన్ని మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతులమీదుగా సంతోష్కుమార్కు అందించినట్టు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా దుర్గానగర్లో 2021 జూలై 4న సంతోష్కుమార్ ప్రత్యేక చొరవతో గంట సమయంలో 16,900 వందల మంది భాగస్వామ్యంతో 3,54,900 మొకలు నాటినట్టు సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఇదే అత్యుత్తమని, పేర్కొన్నది. సమిష్టి కృషి, సామాజిక స్పృహ కు ఈ కార్యక్రమం నిదర్శనమని ప్రశంసించింది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా చాలెంజ్కు చోటు లభించడం, సీఎం కేసీఆర్ చేతులమీదుగా రికార్డు ప్రతిని అందుకోవడం బాధ్యతను మరింత పెంచిందని ఎంపీ సంతోష్కుమార్ చెప్పా రు. ఈ రికార్డు దకడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అని తెలిపారు. జోగు రామన్న తన బర్త్డే సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా విశేష కృషిచేసి గంటలోనే మూడున్నర లక్షలు మొకలు నాటించారని పేర్కొన్నారు. ఈ అవార్డును ఎమ్మెల్యే జోగు రామన్నకు, ఈ నేల పచ్చగా ఉండాలని అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రకృతి ప్రేమికులు సాలుమారద తిమ్మక, వనజీవి రామయ్య, జాదవ్ పయాంగ్తోపాటు గ్రీన్ ఇం డియా చాలెంజ్లో భాగంగా కోట్ల మొకలు నాటిన ప్రతి ఒకరికి అంకితం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభం నుంచి మొకలు నాటిన ప్రతి కార్యక్రమం తెలిసేలా సంస్థ ప్రతినిధులు వీడియోను విడుదల చేశారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సంజీవ, రాఘవ తదితరులు పాల్గొన్నారు.