హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర మిల్లింగ్ కెపాసిటీ సరిపోతలేదు. 2 కోట్ల టన్నుల ధాన్యం సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మిల్లింగ్ చేయాలని నిర్ణయించినం. ఇది త్వరలోనే సాకారమవుతుంది. ధాన్యం దిగుబడిని 4 కోట్ల టన్నులకు పెంచబోతున్నం. ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన మొ త్తం పంట కొనటం లేదు. రైతులు పండిన ధాన్యం మొత్తం కొని, ఐదారు రోజుల్లో బ్యాంక్ ఖాతాలకు డబ్బులు పంపిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. వడ్లు కొని చిట్టి ఇస్తున్నరని భట్టి విక్రమార్క అంటున్న రు. ఎక్కడన్న చిట్టీ ఇస్తున్నమా అండీ! భట్టికి వాళ్ల జమానా యాదికొచ్చి చెప్తున్నట్టున్నడు పాపం. ఇ ప్పుడు చిట్టీ లేదు. పొట్టీ లేదు. కొనంగనే తక్షణమే రికార్డు అవుతున్నది. డబ్బులు రైతలు ఖాతాల ప డుతున్నయ్. వాళ్ల జమానాలో సేట్ల, బీట్ల, మండీ ల చుట్టూ తిప్పిన్రు. ఇప్పుడట్ల చేయడం లేదు.
ఇసుక పండినట్టు పంటలు పండుతున్నయ్
కాంగ్రెస్ హయాంలో మొత్తం మన వరి ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు. ఇవాళ 3 కోట్ల టన్నులు దాటిపోయి పంజాబ్ను తలదన్నిపోతున్నం. మాట్లాడితే ఎన్నయినా చెప్పవచ్చు. ధాన్యం కొనుడు ఆలస్యమైతాంది. జల్ది కొనాలని భట్టి విక్రమార్క అంటున్నరు. మీ కాంగ్రెస్ పెట్టుబడి అనుకుంటున్నరా? కాంగ్రెస్ పంట అనుకుంటున్నరా? మూడు కోట్ల ధాన్యం కొనాలె. గుంజుటానికే (కొనడానికే) 3, 4 నెలలు పడుతది. డీసీఎంలు, ట్రాక్టర్లు, గిర్నీలు ఏవీ సరిపోతలేవు. స్టా క్లు పెడతామంటే గోదాములు సరిపోతలేవు. ఏడాదిలో 30 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను హరీశ్రావు నేతృత్వంలో కట్టించుకున్నం. అంతకుముందు 3 లక్షల టన్నుల సా మర్థ్యం గల గోదాములుండె.. రాష్ట్రంలో పంట ఇసుక పండినట్టు పండుతున్నది.
తెలంగాణ రైతు లు ఎంత గొప్పోళ్లంటే ఫ్రీ కరెంట్ ఇచ్చి.. రైతుబంధు ఇచ్చి పంటలు పండించుమంటే పంజాబ్ను తలదన్నే పంటలు పండించే గొప్ప రైతులు నా తెలంగాణ రైతులు. ఇందుకు నేను గర్వపడుతున్నా. ఇప్పుడు మళ్లా బుల్లెట్లు వచ్చినట్టు వడ్లు వస్తయ్ అంటూ సివిల్ సైప్లె మంత్రి గంగుల కమలాకర్ మొన్న నాతో పంచాయితీ పెడుతున్నడు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనడంతో కోటి టన్నుల ధాన్యం గోదాముల్లో ఉన్నది ఏం చేయాలంటే.. వేలం పెట్టి అమ్ముమన్నా. పోతేపాయే 500 కోట్లు. మన రైతలు మీద దిష్టి తీసినమనుకుందాం. వేలం పెట్టి అమ్మిపడేయ్. గోదాములు ఖాళీ చేయ్మని చెప్పిన. ఆ ధాన్యంపైనా ఈ బుద్ధిమంతులు మా ట్లాడుతున్నరు. నష్టం వచ్చినా తెలంగాణను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నం. అనుకోకుండా ధాన్యం తడిసినా సేమ్ రేటు ఇచ్చి కొంటున్నం.