హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఈ యాసంగిలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. గత యాసంగి సీజన్లో మే 30 వరకు కొనుగోలు చేసిన ధాన్యం కంటే ఇది 12 లక్షల టన్నులు అధికమని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు, రైతు సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి సేకరించామని వివరించారు. ధాన్యం సేకరణకు రికార్డు స్థాయిలో 7,000 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,400 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. కొనుగోళ్ల సమయంలో రాజకీయం చేయకుండా ప్రతి ఒకరూ బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
మే 30 వరకు ధాన్యం కొనుగోళ్లు ఇలా..