ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన తెలంగాణ నాదస్వర కళాకారులు షేక్ జాన్పాషా, ఆరేపల్లి నాగరాజును శనివారం తన క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు.
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి వివరించారు. కార్యక్రమంలో మంగళవాయిద్య కళాకారుల సంఘం ప్రతినిధులు తులసీదాసు, నాగబెల్లి సునీల్ తదితరులు పాల్గొన్నారు.