హైదరాబాద్, మార్చి 10 : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలను విడుదలచేస్తూ గురువారం ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులిచ్చారు. 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,658 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరికి అందాల్సిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలకు రూ.57.78 కోట్లను మంజూరుచేశారు. 2021 సంవత్సరంలో 12 జిల్లాల్లోని అధ్యాపకులకు చెల్లించాల్సిన రూ.5.96 కోట్ల పెండింగ్ వేతనాలను సైతం విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక సంఘాల నేతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.