హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు కోతల్లేని, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషిచేస్తామని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) నేతలు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసింది.
ఈ సందర్భంగా రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ వంతుపాత్రను పోషిస్తామని నేతలు సీఎం రేవంత్రెడ్డితో అన్నారు. అంతేకాకుండా విద్యుత్తు సంస్థ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ నేతలు పరమేశ్ సహా ఇతర నాయకులు ఉన్నారు.