హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. కాగా,16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యంక్తం చేశారు. దేశంలోనే మెరుగైన విద్యను అందిస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్రం అన్నారు.