హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, నవీన్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను, అధికారులను రాష్ట్రపతికి సీఎం పరిచయం చేశారు. అనంతరం రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకొన్నారు. శనివారం దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించే సీజీపీకి రీవ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి హాజరవనున్నారు. పరేడ్ అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.