హైదరాబాద్ : నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా హాజరై నుమాయిష్ను ప్రారంభించగా, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి మహమాద్ అలీ మాట్లాడుతూ ఎగ్జిబిషన్పై వచ్చే ఆదాయాన్ని విద్య కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. నుమాయిష్కు జమ్మూకశ్మీర్ నుంచి సైతం వ్యాపారులు వచ్చారని తెలిపారు. నుమాయిష్లో రుచికరమైన ఆహారపదార్థాలు ఉంటాయన్నారు.
ప్రజలు మాస్క్ లేకుండా రావొద్దని, సుమాయిష్లో కొవిడ్ టీకా కేంద్రం కూడా ఏర్పాటు చేశారన్నారు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ హైదరాబాద్ నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందన్నారు. టీకా కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మాస్క్ పెట్టుకోని వారిని నుమాయిష్లోకి అనుమతించొద్దని నిర్వాహకులకు సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ప్రారంభమైన నుమాయిష్ 45 రోజుల పాటు ఫిబ్రవరి 15వ తేదీ వరకు సాగనున్నది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది స్టాళ్ల సంఖ్యను కుదించారు.