చెన్నూర్, ఆగస్టు 25 : నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లికి చెందిన కొండగుర్ల సుమంత్కు, చెన్నూర్ మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాయిపేటకు చెందిన దుర్గం రంజిత్కు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
నిరుపేద కుటుంబాలు కావడంతో విప్ బాల్క సుమన్ హైదరాబాద్కు పిలిపించి రూ.లక్ష చొప్పున ఇద్దరికి ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వపరంగా మరో రూ. రెండు లక్షలు అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్కు సూచించారు. ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేసిన విప్ బాల్క సుమన్కు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.