జనగామ, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల యుద్ధంలో బీఆర్ఎస్కు అసలైన సైనికులు సోషల్ మీడియా వారియర్స్ అని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ జిల్లా సోషల్ మీడియా వారియర్స్తో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షు డు, జెడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్పై వివిధ సోషల్ మీడియాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. తెలంగాణ ప్ర భుత్వం పదేండ్లుగా అమలు చేస్తున్న వినూ త్న, విప్లవాత్మక, సహసోపేత పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీకి అఖండ విజయాన్ని చేరువ చేసే యజ్ఞంలో వారియర్స్ ముందు వరుసలో ఉం డాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల నాటికి గ్రా మ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎక్కడిక్కడ సోషల్ మీడియా మరింత పటిష్టం కావాలని ప్రతిపక్ష పార్టీల తప్పుడు పోస్టులను వాస్తవిక అంశాలతో ఎదుర్కోవాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యం పండే ప్రాంతంగా జనగామ నిలిచిందని అన్నారు. రాష్ర్టాన్ని 50 ఏండ్లు కాంగ్రెస్, పదేండ్లు టీడీపీ పాలించినా.. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వలేదని అన్నారు. పెట్టుబడి సాయం, రైతుబీమా కూ డా ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ పాలిత రా ష్ర్టాల్లో అక్కడి రైతులకు 24 గంటల కరెంటు, రైతుబీమా, పెట్టుబడి సాయం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఆయా రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీళ్ల శాఖ మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య ఉండి కూడా కరువుకు కేరాఫ్ జనగామ అయ్యిందని అన్నారు. తెలంగాణొచ్చాక జనగామ.. జలగామగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో చెరువులను ధ్వంసమైనట్టు చెప్పారు. స్వరాష్ట్రంలో మిషన్ కాకతీయ, దేవాదులతో రైతులు ఏడాదికి రెండు పంట లు పండిస్తున్నారని తెలిపారు.