డీఆర్డీఏ ఏపీడీ వసుమతి
శాయంపేట, ఏప్రిల్ 10: గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డీఆర్డీఏ ఏపీడీ వసుమతి అన్నారు. మండలంలోని ఆరెపల్లి శివారులో ఏర్పాటు చేసిన శాయంపేట నర్సరీని ఏపీడీ శనివారం సందర్శించారు. నర్సరీలో ఏయే మొక్కలు పెంచుతున్నారో పరిశీలించారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చిమొక్కలు పెరిగితే వెంటనే తొలగించాలని, వాచర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నర్సరీలపై షెడ్నెట్లను మొక్కలకు గాలి తగిలేలా ఏర్పాటు చేయాలని సూచించారు. శాయంపేట గ్రామానికి పదివేల మొక్కలు టార్గెట్ కాగా, మరో 50 వేల మొక్కలు పెంచాలని ఆదేశించారు. విత్తనాలను కొనుగోలు చేసి పూర్తిస్థాయిలో నర్సరీలో నాటాలన్నారు. నిర్దేశించిన విధంగా మొక్కలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి రమణారెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
నర్సరీ పనుల్లో వేగం పెంచాలి
నర్సంపేట రూరల్: నర్సరీ నిర్మాణ పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు వేగం పెంచాలని ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు అన్నారు. ముగ్ధుంపురం, పాతముగ్ధంపురం, రాములునాయక్తండా, లక్నేపల్లిలో నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో వెంట సర్పంచ్లు పెండ్యాల జ్యోతి-ప్రభాకర్, లావణ్య, మాధవి, గొడిశాల రాంబాబు, కార్యదర్శులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎన్నడూ అనుకోలే!
IPL 2021: టాస్ గెలిచిన రిషబ్ పంత్