వేములవాడ, మే 6: కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్లో భూములు కోల్పోతున్న కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూ రు కాపు నిత్యాన్న సత్రం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.
రాజన్న ఆలయానికి అర కిలోమీటర్ దూరంలో రైల్వేస్టేషన్ ఏర్పాటు, రైల్వేలైన్ పోతుండడంతో 178 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరిస్తురని చెప్పారు. ఎకరానికి రూ.34లక్షలు ఇస్తే తాము నష్టపోతామని వాపోయారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రధానికి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.