షాబాద్, ఏప్రిల్ 26 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హన్మనాయక్ తండాలో వీరాంజనేయస్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలన్నారు.
ఆధ్యాత్మిక చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, గ్రామ సర్పంచ్ నరేందర్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గోపాల్నాయక్, రాంరెడ్డి, ఉప సర్పంచ్ రవీందర్నాయక్, గ్రామస్తులు తదితరులున్నారు.