Shamshabad Airport |శంషాబాద్ రూరల్, అక్టోబర్ 22: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అనుమతి లేకుండా 610 గ్రాముల బంగారం తీసుకొస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
దాని విలువ రూ.32.84 లక్షలు ఉంటుందని చెప్పారు. మరో కేసులో రూ.29.48 లక్షల విలువైన 483 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్టున్నట్టు తెలిపారు.