శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 19: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద శనివారం కస్టమ్స్ అధికారులు రూ.20.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా, అతడి వద్ద 394.18 గ్రాముల బంగారం లభించింది. బంగారంతోపాటు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.