భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నది మరింతఉగ్రరూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నది నీటిమట్టం 50.50 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 12,86,136 క్యూసెక్కుల వరద పారుతున్నది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతోపాటు పొంగుతున్న వాగులు దాటకుండా బారికేడ్లు ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల (Collector Priyanka Ala) తెలిపారు.
వరద ఉధృతి కొనసాగుతున్నదని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయని చెప్పారు. ప్రజలు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. గోదావరిలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుటంతో భద్రాచలం, చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.